News March 10, 2025

మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సమచిత స్థానం

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఖరారు చేసినందుకు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News March 10, 2025

జనగామ: నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

జనగామ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు.

News March 10, 2025

విశాఖలో నేటి కూరగాయ ధరల వివరాలు

image

విశాఖలోని వ్యవసాయ, వాణిజ్య శాఖ అధికారులు సోమవారం నాటి కూరగాయ ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు టమోటా కేజీ రూ.14 , ఉల్లిపాయలు కేజీ రూ.28 , బంగాళాదుంపలు కేజీ రూ.15, వంకాయలు రూ.22/24/32, బెండకాయలు రూ.44, మిర్చి రూ.24, బరబాటి రూ.36, క్యారెట్ రూ.24, బీరకాయలు రూ.50, వెల్లుల్లి రూ.60/80/90గా నిర్ణయించారు.

News March 10, 2025

గుంటూరు: క్వశ్చన్ పేపర్ లీక్.. తీగలాగితే డొంక కదిలింది

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఈడీ ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో 9 మంది ఏజెంట్లతో పాటూ వినుకొండలో ఓ కళాశాలకు చెందిన ఛైర్మన్, కంప్యూటర్ ఆపరేటర్ కీలకపాత్ర పోషించారు. ANU ఈ మేరకు తెనాలిలో ఓ వ్యక్తిని విచారించగా సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నాపత్రం తనకు వచ్చిందని అన్నారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేపట్టగా ప్రశ్నాపత్రం వినుకొండ నుంచి అందరికీ ఫార్వర్డ్ అయినట్లు నిర్ధారించుకున్నారు.

error: Content is protected !!