News February 1, 2025
మహబూబాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. మండలస్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.
Similar News
News October 28, 2025
లోకేశ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్

AP: డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2030 నాటికి 6వేల MW డేటా సామర్థ్యమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్ను మంత్రి నారా లోకేశ్ లీడ్ చేయనున్నారు. ఇందులో Microsoft Azure, Jio Platforms వంటి అంతర్జాతీయ కంపెనీలు, IIM విశాఖ, IIT తిరుపతి సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించారు. పెట్టుబడులు, అనుమతులు, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై కౌన్సిల్ మార్గనిర్దేశం చేయనుంది.
News October 28, 2025
శ్రీకాకుళం టుడే టాప్ హెడ్ లైన్స్ ఇవే

➫శ్రీకాకుళం జిల్లాపై మొంథా తుఫాన్ ప్రభావం
➫తుఫాన్ పై అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
➫శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు
➫మెండపేట-రాళ్లపేట రహదారి గుంతలమయం
➫శ్రీకాకుళం:చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
➫తుఫాన్ ప్రభావంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
➫పొందూరు, ఎల్.ఎన్ పేటలో నేలమట్టం అయిన వరి పంట
News October 28, 2025
వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.


