News November 25, 2025

మహబూబాబాద్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

image

మహబూబాబాద్ జిల్లాలోని 482 పంచాయతీలకు ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురులోని 155 పంచాయతీలకు నిర్వహించనున్నారు. 2వ దశలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్ద వంగర, తొర్రూర్‌లోని 158 పంచాయతీలకు నిర్వహించనున్నారు. 3వ దశలో డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి మరిపెడ, సీరోలు మండలాల్లోని 169 పంచాయతీలకు జరుగనున్నాయి.

Similar News

News November 27, 2025

కైకలూరు కృష్ణాజిల్లాలోకి తిరిగి వచ్చేనా..!

image

ఒకప్పుడు కృష్ణాజిల్లాలో భాగంగా ఉన్న కైకలూరు నియోజకవర్గం మళ్లీ జిల్లాలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత YCP హయాంలో కైకలూరును ఏలూరు జిల్లాలోకి తీసుకువెళ్లారు. ఈ విలీనాన్ని వ్యతిరేకించిన నియోజకవర్గ ప్రజలు కృష్ణాజిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్ ను బలంగా వినిపించారు. మరి కూటమి ప్రభుత్వం కైకలూరును జిల్లా పరిథిలోకి తెస్తారో, లేదో చూడాలి.

News November 27, 2025

కరీంనగర్: నియోజకవర్గానికి దూరంగా ఎమ్మెల్యేలు..?

image

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ MLAలకు తలనొప్పిగా మారింది. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆశావహులుగా ఉండటమే ఇందుకు కారణం. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 మంది వరకు తమ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని MLAలపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో MLAలు ఎటూ తేల్చుకోలేక మండల అధ్యక్షులకు ఎంపిక బాధ్యతలను అప్పజెప్పుతుండగా మరి కొంతమంది MLAలు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

News November 27, 2025

RECORD: వికెట్ కోల్పోకుండా 177 రన్స్

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, సంజూ శాంసన్ రికార్డు సృష్టించారు. ఒడిశాతో మ్యాచులో వికెట్ కోల్పోకుండా 177 రన్స్ చేశారు. రోహన్ 60 బంతుల్లో 10 సిక్సులు, 10 ఫోర్లతో 121*, సంజూ 41 బంతుల్లో 51* పరుగులు బాదారు. ఈ టోర్నీ హిస్టరీలో ఇదే అత్యధిక ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్. ఈ మ్యాచులో తొలుత ఒడిశా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేయగా, కేరళ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.