News January 27, 2025

మహబూబాబాద్ జిల్లా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ

image

మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లోని ,19 గ్రామాలకు చెందిన రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.18 కోట్ల 14 లక్షలను రైతు భరోసా పథకం కింద జమ చేసింది. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న, గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో ఈ నగదును జమ చేసినట్లు అధికారులు తెలియజేశారు. రైతు భరోసా నిధులు జమ కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 9, 2025

HYD: KTRను చెత్తకుండికి కట్టేయండి: CM రేవంత్

image

జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ‘చెత్త’ చుట్టూ రాజకీయం ఆగడం లేదు. తాజాగా CM రేవంత్ KTRకు కౌంటర్ వేశారు. ‘ఆడ చెత్త ఉంది.. ఈడ చెత్త ఉంది అంటున్నారు. 3 సార్లు BRS MLA ఉండు. మున్సిపల్ మిన్సిస్టర్ KTR, MPగా కిషన్ రెడ్డి ఉండు. ఇన్నేళ్లు ఏం చేశారు? తోడు దొంగలు మీరే. మా ప్రాతినిథ్యం లేని చోట జవాబు చెప్పమనడం ఏంటి?. చెత్తకుండిని చూసి KTRను అక్కడ కట్టేయండి. ఆయనకు తత్వం అయినా బోధపడుతది’ అంటూ CM వ్యాఖ్యానించారు.

News November 9, 2025

HYD: KTRను చెత్తకుండికి కట్టేయండి: CM రేవంత్

image

జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ‘చెత్త’ చుట్టూ రాజకీయం ఆగడం లేదు. తాజాగా CM రేవంత్ KTRకు కౌంటర్ వేశారు. ‘ఆడ చెత్త ఉంది.. ఈడ చెత్త ఉంది అంటున్నారు. 3 సార్లు BRS MLA ఉండు. మున్సిపల్ మిన్సిస్టర్ KTR, MPగా కిషన్ రెడ్డి ఉండు. ఇన్నేళ్లు ఏం చేశారు? తోడు దొంగలు మీరే. మా ప్రాతినిథ్యం లేని చోట జవాబు చెప్పమనడం ఏంటి?. చెత్తకుండిని చూసి KTRను అక్కడ కట్టేయండి. ఆయనకు తత్వం అయినా బోధపడుతది’ అంటూ CM వ్యాఖ్యానించారు.

News November 9, 2025

కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్

image

TG: KCR తెచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని, వాటికి అదనంగా మరిన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. నాడు అభివృద్ధిని పక్కనపెట్టి ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగతిభవన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. ‘నేను SC వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగణన చేసి చూపించా. రాష్ట్ర గీతాన్ని అందించా. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించా’ అని రేవంత్ వివరించారు.