News March 20, 2025
మహబూబాబాద్ మార్కెట్కు పోటెత్తిన ఎర్రబంగారం

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పోటెత్తింది. బుధవారం తేజ, తాలు రకం కలిపి 6,727 బస్తాల మిర్చి విక్రయాలు జరిగాయి. తేజ రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.13,639, కనిష్ఠ ధర రూ.9,500 తాలు రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,350, కనిష్ఠ ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News March 20, 2025
ఎస్సీలను ఆదుకుంది TDPనే: చంద్రబాబు

AP: ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు ఇచ్చింది ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీలను అన్నివిధాల ఆదుకుంది టీడీపీనేనని అసెంబ్లీలో పేర్కొన్నారు.. ‘దళితులైన బాలయోగిని లోక్సభ స్పీకర్, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్, కాకి మాధవరావును సీఎస్ చేశాం. ఎస్సీల కోసం రూ.8,400 కోట్లతో పథకాలు తీసుకొచ్చాం. ఉగాది నుంచి పీ4 ప్రారంభిస్తాం. వర్గీకరణకు సహకరించిన BJPకి, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News March 20, 2025
HYDలో మిస్ వరల్డ్ పోటీలు: జూపల్లి

TG: హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. 140 దేశాల అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. అలాగే రాష్ట్రానికి ఆర్థికంగానూ లబ్ధి చేకూరుతుందని చెప్పారు. స్క్విడ్ గేమ్, BTS బ్యాండ్ లాంటివి సౌత్ కొరియా అభివృద్ధికి ఉపయోగపడ్డాయని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు.
News March 20, 2025
మోదీని కలిసిన ఎంపీ కుటుంబ సభ్యులు

ప్రధాని మోదీని ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యులు కలిశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మనుమరాళ్లతో ప్రధానమంత్రి కాసేపు గడిపారు. మెదక్ ఎంపీ దంపతులు, అల్లుడు కూతురు, మనమరాళ్లతో కలిసి ప్రధానమంత్రి కలిసి శాలువా కప్పి సన్మానించారు.