News March 8, 2026

మహబూబాబాద్: లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి: జిల్లా జడ్జి

image

మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీ పడదగ్గ పెండింగ్ కేసులను గుర్తించి, ఎక్కువ సంఖ్యలో పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. గత లోక్ అదాలత్‌లో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిందని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా పనిచేయాలన్నారు.

Similar News

News April 5, 2026

TG EAPCETకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

image

తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల (లేట్ ఫీజు లేకుండా) గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 53.34% మంది అమ్మాయిలు, 46.66% మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమింగ్‌కు 2,03,167 అప్లికేషన్లు వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 10 వరకు రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు EAPCET <>వెబ్‌సైట్<<>> చూడండి.

News April 5, 2026

తొర్రూర్: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

image

భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన MHBD జిల్లా తొర్రూరు(M) హరిపిరాలలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పులిగుజుల అనూష (22)ను ఆమె భర్త సాయి తరచూ అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష, శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుంది. అనూష తండ్రి ఫిర్యాదు మేరకు సాయిపై ఎస్సై ఉపేందర్ కేసు నమోదు చేశారు.

News April 5, 2026

శ్రీ సత్యసాయి: నకిలీ ఏసీబీ అధికారి అరెస్ట్

image

ACB అధికారినంటూ బెదిరించి డబ్బు వసూలు చేసిన కేసులో కూడేరు(M) కలగల్లుకు చెందిన హనుమంతును అరెస్ట్ చేసినట్లు CI శివరాముడు తెలిపారు. 2021లో తహశీల్దార్ అన్వర్ హుస్సేన్‌కు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తాను ACB సీఐ అని, ముదిగుబ్బ తహశీల్దార్ ఆఫీసులో రైడ్ జరగకూడదంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించి రూ.50 వేలు వసూలు చేశాడు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసి, హనుమంతుగా గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు.