News March 28, 2024

మహబూబాబాద్: విద్యుత్తు షాక్‌తో రైతు మృతి

image

విద్యుత్తుషాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది. మదనపురం గ్రామశివారు ధూపతండాకు చెందిన మాలోతు బాలు గురువారం నీళ్లు పెట్టడానికి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై బావిలో పడి ప్రాణాలొదిలాడు. స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 8, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 ధర వచ్చింది. అలాగే ఏసీ 341 రకం మిర్చికి రూ.15,000, వండర్ హాట్(WH) మిర్చికి రూ.16,500 ధర పలికింది. అయితే గత వారంతో పోలిస్తే మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి.

News July 8, 2024

WGL: నేటి నుంచి యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు

image

అసిఫాబాద్ రోడ్డు నుంచి రేచిని రోడ్డు మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజరు రైళ్లను ఈనెల 8 నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. 12757/58 కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌స్రెస్, 17233/34 భాగ్యనగర్ ఎక్స్‌స్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు, 17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

News July 8, 2024

WGL: పెళ్లి కావడం లేదని చనిపోయాడు..!

image

పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్‌లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు