News January 20, 2026
మహబూబ్నగర్లో అగ్నిప్రమాదం

మహబూబ్నగర్ పట్టణంలోని పారిశ్రామిక వాడలో గల ఓ బెడ్ వర్క్స్లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండటంతో ప్రమాద ముప్పు పొంచి ఉందని, ఆ బెడ్ వర్క్స్ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News February 3, 2026
MBNR: ఆపరేషన్ స్మైల్-XII.. ప్రశంసాపత్రాలు అందజేత

జిల్లాలో బాల కార్మికత్వ నిర్మూలనకు ‘ఆపరేషన్ స్మైల్-XII’లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు. మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. నోడల్ అధికారిగా సమర్థవంతంగా పనిచేసిన ఏఎస్పీ ఎన్.బి.రత్నంను ప్రత్యేకంగా అభినందించారు. బాలల ఉజ్వల భవిష్యత్తు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
News February 3, 2026
జడ్చర్ల: గురుకుల పాఠశాల విద్యార్థుల అదృశ్యం.. ముంబైలో ప్రత్యక్షం

జడ్చర్ల మండలం నాగసాల సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆదివారం పాఠశాలలో చీటీ రాసి తాము ఐదేళ్ల తర్వాత వస్తామని అదృశ్యమయ్యారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు విచారణ నిర్వహించి విద్యార్థులు ముంబైలో ఉన్నట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించి విద్యార్థులను పట్టుకున్నారు. విద్యార్థులను తీసుకురావడానికి వారి తల్లిదండ్రులు పోలీసులు ముంబైకి వెళ్లారు.
News February 3, 2026
పాలమూరు కార్పొరేషన్లో ఖాతా తెరిచిన కాంగ్రెస్

మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ అధికార కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన ఖాతాను తెరిచింది. పాలమూరు కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది. రాజేంద్రనగర్ ప్రాంతంలోని 58వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి ఎన్నిక లాంఛనమైంది. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో హస్తం పార్టీ జెండా ఎగిరింది.


