News November 19, 2025

మహబూబ్‌నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News April 5, 2026

ఖమ్మం జిల్లాలో 8న పాడైన చక్కెర వేలం

image

ఖమ్మం జిల్లాలోని గోదాముల్లో నిల్వ ఉన్న, వినియోగానికి పనికిరాని చక్కెరను వేలం వేయనున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలత తెలిపారు. ఈనెల 8న ఖమ్మం అర్బన్, 9న నేలకొండపల్లి, వైరా, 10న ఏన్కూరు, సత్తుపల్లి కేంద్రాల్లో వేలం నిర్వహించనున్నారు. మొత్తం సుమారు 23.84 మెట్రిక్ టన్నుల చక్కెర వేలం వేస్తామని, వేలం దక్కించుకున్న వారే రవాణా ఖర్చులు భరించాలని ఆమె స్పష్టం చేశారు.

News April 5, 2026

సింగిపురం: 113కి చేరిన కల్తీ బాదంపాల బాధితుల సంఖ్య

image

శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం జాతరలో కల్తీ బాధంపాలు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో శుక్రవారం సుమారు 80 మంది పీహెచ్సీలో చేరగా.. శనివారంనాటికి కేసులు 113కు పెరిగాయి. ప్రస్తుతం బాధితులకు స్థానిక పీహెచ్సీలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.

News April 5, 2026

KMR: జిల్లాలో చికెన్, మటన్ ధరలు

image

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ.280-రూ.290 విక్రయిస్తుండగా లైవ్ కోడి రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. మటన్ ధరలో ఎలాంటి మార్పు లేదు.