News March 18, 2025
మహబూబ్నగర్: దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మహబూబ్నగర్ పట్టణంలోని సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణను దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు.
Similar News
News March 19, 2025
MBNR: ‘బీసీ బిల్లు బీసీ సంఘాల ఐక్య పోరాట ఫలితమే’

రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం బిల్లు బీసీ రాజ్యాధికారానికి తొలిమెట్టు అని బీసీ సమాజ్ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బీసీ సమాజ్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీని అమలు చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు.
News March 19, 2025
MBNR: ప్రజారంజక బడ్జెట్: MLA జీఎంఆర్

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బడ్జెట్ పై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యం,ఉపాధి, రైతు, కార్మిక, ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్, తెలంగాణ బడ్జెట్ సీఎం రేవంత్ రెడ్డి కృషితో ప్రజల అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News March 19, 2025
కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.