News April 4, 2025
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల బీఎస్పీ ముఖ్య నేతల సమావేశం

బహుజన సమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శుక్రవారం మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రహీం శేఖర్ హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా సామాజికంగా ఎదిగి ఇతరులకు సహాయపడాలని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను రాజ్యాంగ బద్ధంగా ప్రశ్నించాలన్నారు.
Similar News
News December 24, 2025
హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 24, 2025
అంతా తానై మనల్ని రక్షిస్తున్న ‘విష్ణుమూర్తి’

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్న్యాయో నేతా సమీరణః|
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్||
సృష్టిలో అందరికంటే ముందుండేవాడు, జీవులను సత్మార్గంలో నడిపించేవాడు, సమస్త ఐశ్వర్యాలకు అధిపతి ‘విష్ణుమూర్తి’. ఆయన నాయకుడే కాదు, న్యాయ స్వరూపుడై లోకాన్ని శాసిస్తాడు. విశ్వమంతా నిండిన ఆ ఆత్మ స్వరూపుడికి వేయి శిరస్సులు, వేయి కన్నులు, వేయి పాదములు ఉంటాయి. అంతటా తానై ఉండి మనల్ని రక్షిస్తుంటాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 24, 2025
ఏజెన్సీ ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు

AP: ఏజెన్సీలోని ఆసుపత్రులకు మందులు తదితరాలను ఇకనుంచి డ్రోన్ల ద్వారా అందించనున్నారు. ఈమేరకు ‘రెడ్ వింగ్’ అనే సంస్థతో వైద్యారోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ సంస్థ అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి సేవలు అందిస్తోంది. పాడేరు కేంద్రంగా 80 KM పరిధిలోని ఆసుపత్రులకు ఈ సంస్థ డ్రోన్లతో మందులు అందిస్తుంది. డ్రోన్లు తిరిగి వచ్చేటపుడు రోగుల రక్త, మల, మూత్ర నమూనాలను తీసుకువస్తాయని కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు.


