News April 10, 2025
మహబూబ్నగర్: నేటి నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలోని ఆచార్యపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీవీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమై సోమవారం వరకు ఐదు రోజులపాటు కొనసాగానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వ్యవస్థాపకుడు తమ్మళి విజయకుమార్, రాజేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా, కర్ణాటక రాష్టం నుంచి భక్తులు వస్తుంటారు.
Similar News
News April 18, 2025
మహబూబ్నగర్ జిల్లాలో 40 డిగ్రీలకు చెరువలో ఎండ

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటలు దాటిందంటే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నటు పరిస్థితి నెలకొంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 21.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
News April 18, 2025
నాగర్కర్నూల్: పోలీస్ కస్టడీలో గ్యాంగ్ రేప్ నిందితులు

నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల మహిళపై ఏడుగురు యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన తెలిసిందే. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు పంపారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు గురువారం కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. ఊర్కొండపేట దేవాలయం సమీపంలో వారు గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
News April 18, 2025
వసతి గృహంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ తనిఖీ

MBNR జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యపై దృష్టి పెట్టి చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యతోపాటు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చెప్పారు.