News March 20, 2025
మహబూబ్నగర్: బైపాస్ రోడ్డు నిర్మించాలని కేంద్ర మంత్రికి వినతి

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డును నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా & రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో గురువారం మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.
Similar News
News March 21, 2025
మహబూబ్నగర్: పుష్ప.. తగ్గేదేలే..!

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం ఖో-ఖో పోటీలకు మహబూబ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాంనగర్ పాఠశాలలో PETగా విధులు నిర్వహిస్తున్న బి.పుష్ప ఖో-ఖో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉమెన్స్ ఖో-ఖో టోర్నీలో ఆమె పాల్గొననున్నారు. దీంతో హెచ్ఎం అంజలి దేవి, ఉపాధ్యాయులు అభినందించారు. CONGRATULATIONS
News March 21, 2025
ఓటర్ జాబితాపై రాజకీయ పార్టీలు సహకరించాలి: MBNR కలెక్టర్

ఓటర్ జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా మార్పులు, చేర్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విజ్ఞప్తి చేశారు. గురువారం తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఒంటరిగా నమోదు చేసుకోవాలని, ఇందుకు వారు సహకరించాలన్నారు. మార్పులు చేర్పులతోపాటు తప్పులు లేని జాబితా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News March 21, 2025
మహబూబ్నగర్: ఎండిన వరి పొలాన్ని పరిశీలించిన కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పోచమ్మ గడ్డ తండాలో రైతు బిక్యా నాయక్కు చెందిన మూడెకరాల వరి పొలాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. భూగర్భ జలాలు పడిపోవడంతో వరి పంట ఎండిపోయిందని, రైతులకు ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో వ్యవసాయం ఎలా చేసుకోవాలో అగ్రికల్చర్ ఆఫీసర్లు తెలియజేయాలన్నారు. వారికి సూచనలు, సలహాలు అందించాలన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఏడీ ఆంజనేయులు ఉన్నారు.