News April 12, 2025
మహబూబ్నగర్: ‘భారీగా మామిడి పండ్ల ధరలు’

వేసవి కాలం నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మార్కెట్లలో మామిడి పండ్ల కొనుగోళ్లు షురూ అయ్యాయి. ప్రస్తుతం మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఒక్కో బాక్స్కు ధర రూ.7,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతుందని చెప్పారు. రిటైల్ మార్కెట్లో కేజీ ధర రూ.150 నుంచి రూ.250 వరకు అమ్మడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రేట్ ఎంత ఉంది.. కామెంట్ చేయండి.
Similar News
News January 7, 2026
HYD: లవ్ ఫెయిల్.. యువ డాక్టర్ బలి!

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య(23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న HYD అల్వాల్కు చెందిన ప్రణయ్కి 2025 జులైలో లావణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి కులాన్ని అడ్డుగా చూపించి నిరాకరించాడు. దీంతో గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని లావణ్య సూసైడ్ చేసుకుంది. ప్రణయ్పై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News January 7, 2026
HYD: లవ్ ఫెయిల్.. యువ డాక్టర్ బలి!

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య(23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న HYD అల్వాల్కు చెందిన ప్రణయ్కి 2025 జులైలో లావణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి కులాన్ని అడ్డుగా చూపించి నిరాకరించాడు. దీంతో గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని లావణ్య సూసైడ్ చేసుకుంది. ప్రణయ్పై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News January 7, 2026
ఉద్యమ పార్టీతో తెగిపోయిన కవిత బంధం!

TG: రాష్ట్ర సాధన కోసం KCR స్థాపించిన TRSలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కవితకు ఆ పార్టీతో పూర్తిగా బంధం తెగిపోయింది. ఆమె MLC పదవి రాజీనామాకు మండలి ఛైర్మన్ <<18784326>>ఆమోదం<<>> తెలిపారు. తండ్రితో కలిసి ఉద్యమంలో పాల్గొన్న కవిత ఆ పార్టీపైనే ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడింది. పార్టీ తనను ఘోరంగా అవమానించిందంటూ ఇటీవల అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలోనే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు.


