News March 21, 2025
మహబూబ్నగర్: మొదటి పరీక్షకు 41 మంది గైర్హాజరు

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. నేటి పరీక్షకు 12,785 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,744 మంది విద్యార్థులు హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక మొత్తంగా 99.98 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. పరీక్షల సందర్భంగా నేడు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
Similar News
News March 22, 2025
MBNR: పరిశ్రమల అనుమతులు తక్షణమే మంజూరు: కలెక్టర్

పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖలు మంజూరు చేయ్యాల్సిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అదికారులను ఆదేశించారు. శుక్రవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News March 22, 2025
MBNR: మహిళలకు న్యాయసేవలు: జిల్లా న్యాయ సేవ

పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పరిష్కార చట్టం-2013 చట్టంపై మహిళలందరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళ ఉద్యోగినులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలు పని చేసే కార్యాలయంలో వారిపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.
News March 21, 2025
మహబూబ్నగర్ బస్టాండ్ రద్దీ

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ శుక్రవారం రద్దీగా కనిపించింది. గురువారంతో ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో కాలేజీ హాస్టల్స్లో ఉండే విద్యార్థులు, బయట రూంలు తీసుకొని చదువుకునే విద్యార్థులు ఖాళీ చేసి సొంతూళ్లకు బయలుదేరారు. వారితో పాటు తల్లిదండ్రులు కూడా రావడంతో బస్టాండ్ రద్దీగా కనిపించింది.