News October 10, 2025

మహబూబ్‌నగర్-రాయచూర్ రహదారికి మహర్దశ

image

మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గుడెబల్లూరు వరకు (NH-167) ఉన్న 2 వరుసల రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు NHAI నిర్ణయించింది. రూ.2,278.38 కోట్ల అంచనాలతో 80 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం జరగనుంది. గురువారం టెండర్లు ఆహ్వానించగా, హ్యామ్ మోడల్‌ పద్ధతిలో ఈ రహదారిలో పనులు చేపడతారు. భూసేకరణకు రూ.100 కోట్లు కేటాయించారు. పనులు పూర్తయిన తర్వాత రహదారి వ్యయం టోల్ ఫీజు ద్వారా వసూలు చేస్తారు.

Similar News

News October 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 31 సమాధానాలు

image

1. విశ్వామిత్రుని ఆశ్రమం ‘సిద్ధారామం’.
2. బర్బరీకుడి తండ్రి ‘ఘటోత్కచుడు’.
3. పోతన తన ‘ఆంధ్ర మహాభాగవతం’ గ్రంథాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.
4. కామ దేవుని వాహనం ‘చిలుక’.
5. సంస్కృతంలో కూడా లక్షను లక్ష అనే అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 10, 2025

మొదటి ద్వారం నుంచే శ్రీవారిని చూసే అవకాశం

image

శ్రీవారి దివ్య రూపాన్ని బంగారు వాకిలి(మొదటి గడప) నుంచి వీక్షించే భాగ్యాన్ని TTD కల్పిస్తోంది. సాధారణ దర్శనం ఏడో ద్వారం నుంచి జరుగుతుంది. సుప్రభాత, తోమాల వంటి సేవలను అతి చేరువ(10ft) నుంచి చూసి తరించవచ్చు. ఈ అవకాశం లక్కీ డిప్ ద్వారా ఎంపికైనవారికి లభిస్తుంది. ప్రతి నెలా 18వ తేదీన ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
* ప్రతిరోజూ ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 10, 2025

వర్ధన్నపేట: ప్రిన్సిపల్ దగ్గరుండి మత ప్రచారం చేయించారా..?

image

వర్ధన్నపేట పట్టణంలో <<17967798>>ఫుస్కోస్ ప్రైవేట్ పాఠశాల<<>>లో విద్యార్థులకు ఏకంగా తరగతి గదిలోనే పాఠాలకు బదులుగా మత బోధనలు, విద్యార్థులు భోజనం చేసే ముందు ఏదైనా పనులు చేసే ముందు దేవుని ప్రార్థించాలని సూచించడం, ఎలా ప్రార్థించాలో ప్రాక్టికల్‌గా చూపెడుతున్నాడు. ఈ వీడియోలో పాఠశాల పక్కనే ఉన్న చర్చికి సంబంధించిన ఏరువ రాయపు రెడ్డి అనే ఫాదర్ బోధనలు చేశాడు. ఆ సమయంలో ప్రిన్సిపల్ తరగతి గదిలోనే ఉండడం చర్చనీయాంశంగా మారింది.