News February 26, 2026

మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్‌గా హరిప్రియ

image

ఉమ్మడిజిల్లాలో రెవెన్యూశాఖ అధికారులు బదిలీఅయ్యారు. మేడ్చల్ DROగా విధులు నిర్వహిస్తున్న JLB హరిప్రియను మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్‌గా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న అదనపుకలెక్టర్ పద్మజారాణి గద్వాల DROగా నియమితులయ్యారు. గద్వాల హౌసింగ్ PDగా పనిచేస్తున్న శ్రీనివాసరావు RDOగా నియామకం కాగా, RDOగా పనిచేస్తున్న అలివేలు హౌసింగ్ PDగా నియమితులయ్యారు.

Similar News

News February 26, 2026

ఇండియన్ ఇన్వెస్టర్లకు బంపరాఫర్.. అమెరికన్ స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడి

image

ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లు ఇకపై నేరుగా US స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇంటర్నేషనల్ ఎక్స్‌ఛేంజ్ (NSE IX) గ్లోబల్ యాక్సెస్ యాప్‌ను NSE లాంచ్ చేసింది. దీని ద్వారా యాపిల్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీల షేర్లను నేరుగా కొనుగోలు చేయొచ్చు. GIFT City ద్వారా పనిచేసే ఈ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడికి ప్రత్యేక డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. పాన్, ఆధార్ ఆధారిత డిజిటల్ KYC నిమిషంలోనే పూర్తవుతుంది.

News February 26, 2026

ERగా తిరుపతి.. త్వరలో కొత్త ఉద్యోగాలు

image

APని 2.4 ట్రి.న్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో GOVT తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER)కు ప్రత్యేక ప్రాంతీయ ఆర్థిక ప్రణాళికలు రూపొందించనుంది. విశాఖ ER నమూనాను ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. TERలో 9 జిల్లాలు ఉండి, GSDPలో దాదాపు 34% వాటా కలిగి ఉంది. ఉద్యానవనం, ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, స్పేస్‌టెక్, పర్యాటకం, విద్య రంగాల్లో ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.

News February 26, 2026

ఆరోగ్యం కోసం 10 నిమిషాల మార్నింగ్ రొటీన్‌

image

ఉదయాన్నే 10 నిమిషాలు కేటాయించి డైజెషన్, నాడీ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తొలుత 3 నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత 3 నిమిషాల పాటు స్ట్రెచింగ్స్ లేదా నడకతో గట్ మొబిలిటీ మెరుగుపడుతుంది. 2 నిమిషాల పాటు గోరువెచ్చని నీరు తాగితే బాడీ రీహైడ్రేట్ అవుతుంది. మరో 2 ని.లు ఎలాంటి స్ట్రెస్ లేకుండా టిఫిన్ చేయడానికి ముందు ప్రశాంతంగా ఉండాలి.