News April 15, 2025

మహబూబ్ నగర్ జిల్లాలో.. ఒకే రోజు ఐదుగురి మృతి

image

MBNR జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో సోమవారం ఐదు మంది మృతి చెందారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో పడి విజయ్, సుశాంత్, మహమ్మద్ మృతి చెందగా.. బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లిలో చేపల పేటకు వెళ్లి రాములును కాపాడబోయి యాదయ్య కూడా గల్లంతయ్యాడు. ఈ రెండు ఘటనలతో మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన ఐదుగురు నిరుపేద కుటుంబాలకు చెందినవారు.

Similar News

News July 5, 2025

ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు

image

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News July 5, 2025

కామారెడ్డి జిల్లాలో నాట్లు షురూ.. లక్ష్యం ఎంతంటే?

image

కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్ వరి నాట్లు మొదలయ్యాయి. ఈఏడాది 3.18 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యతపై అధికారులు దృష్టి సారించారు. రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని DAO తిరుమల ప్రసాద్ తెలిపారు.

News July 5, 2025

NLG: 8 నుంచి పోస్టల్‌లో కొత్త సాఫ్ట్వేర్

image

పోస్టల్ డివిజన్లోని NLG, యదాద్రి BNG జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద NLG డివిజన్లోని 2 హెడ్ ఆఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్‌లు, 392 పోస్టాఫీస్‌లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.