News July 7, 2025

మహబూబ్ నగర్ IIIT.. నేడు కౌన్సెలింగ్

image

మహబూబ్ నగర్‌లోని నూతనంగా ఏర్పాటు చేసిన IIITలో 181 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి 66 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. నేడు S.NO:1 నుంచి 564 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు. సందేహాలు ఉంటే E-Mail admissions@rgukt. ac.in, 90525 95661,73825 95661 సంప్రదించాలన్నారు. SHARE IT

Similar News

News July 7, 2025

ఆర్కిటెక్చర్‌ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేదు?: షర్మిల

image

AP: YSR ఆర్కిటెక్చర్ & ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని APCC చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ‘కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతుల కోసం స్టూడెంట్స్ ఏడాదిగా పోరాటం చేస్తున్నారు. జగన్, అవినాశ్‌ అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. గత ప్రభుత్వ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి సర్కార్‌కు లేదా? సర్టిఫికెట్లు లేకుంటే విద్యార్థుల జీవితాలేమవ్వాలి?’ అని మండిపడ్డారు.

News July 7, 2025

SMలో విమర్శలతో డిజైన్ మార్చేశారు!

image

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా APR నెలలో బిహార్ ప్రభుత్వం రూ.40 లక్షల వ్యయంతో బిహార్ షరీఫ్‌లో ‘క్లాక్ టవర్’ నిర్మించిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర <<16018209>>విమర్శలు<<>> రావడంతో ఈ డ్యామేజీని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సదరు టవర్‌ను కూల్చేసింది. దాని స్థానంలోనే సరికొత్త మోడల్ క్లాక్ టవర్‌ను నిర్మిస్తోంది. ఈ భయమేదో ముందే ఉంటే ప్రజాధనం వృథా అవ్వకపోయేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

News July 7, 2025

ప్రతి విద్యార్థికి ఒక మొక్క అందజేత: కలెక్టర్

image

‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసి, వారి తల్లి పేరున పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ఇందుకోసం ‘లీప్ యాప్’ను రూపొందించి, అందులో విద్యార్థులు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.