News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

Similar News

News November 11, 2025

చలికి వణుకుతున్న జగిత్యాల జిల్లా

image

జగిత్యాల జిల్లా చలికి వణుకుతోంది. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన్నెగూడెంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.5℃గా నమోదైంది. అటు గోవిందారం 12.7, మల్లాపూర్, రాఘవపేట, గొల్లపల్లె, తిరమలాపూర్ 12.9, కాత్లాపూర్, నేరెల్ల 13, పూడూర్ 13.3, రాయికల్ 13.4, కోల్వాయి, సరంగాపూర్, మెడిపల్లి 13.7, కోరుట్ల 13.8, పెగడపల్లె 13.2, మల్యాల 13.9, జగిత్యాలలో 14.1℃ గా నమోదయ్యాయి. మిగతా ప్రాంతంల్లోనూ చలి తీవ్రత ఉంది.

News November 11, 2025

HYD: నిర్మాణంలో ఉన్న అందెశ్రీ ఇల్లు ఇదే..!

image

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ NFC నగర్‌లో కవి అందెశ్రీ నిర్మించుకుంటున్న ఇల్లు ఇంకా పూర్తి కాలేదు. 348 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న G+3 భవనం నిర్మాణ దశలో ఉంది. ఇల్లు నిర్మించే స్థోమత లేక లాలాపేటలోని ఇరుకు ఇంట్లో ఉంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌ ఆర్థిక సహాయం చేయడంతో గృహ నిర్మాణం ప్రారంభమైంది. పనులను స్వయంగా పర్యవేక్షించేవారు. కలల సౌధం పూర్తికాకముందే అందెశ్రీ కాలం చేశారు.

News November 11, 2025

అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, సీనియర్ అధికారులు హాజరయ్యారు. J&K డీజీపీ వర్చువల్‌గా పాల్గొంటున్నారు.