News September 21, 2024
మహాకవి గురజాడ జయంతి నేడు
నవయుగ వైతాళికుడు, మహాకవిగా పేరు గాంచిన గురజాడ వెంకట అప్పారావు జయంతి విజయనగరంలో శనివారం జరగనుంది. 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా సర్వసిద్ధి రాయవరంలో ఆయన జన్మించారు. తండ్రి వెంకట రామదాసు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా పనిచేసే సమయంలో అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తండ్రి చనిపోయిన తరువాత విజయనగరం వచ్చి ఉన్నత విద్యను పూర్తి చేశారు. 20వ శతాబ్దంలో వ్యవహారిక భాషోద్యమంలో ఆయన పోరాడారు. SHARE IT..
Similar News
News September 21, 2024
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరట
విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊరట లభించింది. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న దీనికి మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది.
News September 21, 2024
VZM: ‘ఈనెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం’
ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ను శుక్రవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
News September 20, 2024
VZM: గురజాడ జయంతికి సర్వం సిద్ధం
విజయనగరంలో శనివారం నిర్వహించనున్న మహా కవి శ్రీ గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురజాడ స్వగృహంతో పాటు ఆయన విగ్రహం వద్ద విద్యుత్ దీపాల అలంకరణను అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గురజాడ నివాసం విద్యుత్ అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. కలెక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.