News August 13, 2025
మహాదేవపట్నంలో చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రారంభం

ఉండి మండలం మహాదేవపట్నంలో మహిళా సమైక్య సభ్యులు నెలకొల్పిన స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. రూ.25 లక్షల వ్యయంతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీకి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద రూ.8.75 లక్షల సబ్సిడీ లభించింది. మహిళలు పరిశ్రమలు స్థాపించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు సూచించారు.
Similar News
News August 14, 2025
భీమవరం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08816 299181 ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. రానున్న 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 14, 2025
పేరుపాలెం బీచ్ మూసివేత

పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి.వాసు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిందని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఎవరూ బీచ్కు రావొద్దని స్పష్టం చేశారు.
News August 14, 2025
జిల్లాలో భారీ వర్షాలతో అప్రమత్తం

రానున్న 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. సహాయం కోసం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08816-299181 ను సంప్రదించవచ్చు.