News February 9, 2025
మహాదేవపూర్లో గుర్తుతెలియని మృతదేహం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్లోని ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఇది గుర్తించిన స్థానికులు మహాదేవపూర్ ఎస్ఐ పవన్కు సమాచారం అందించారు. ఆయన ఘటన స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
Similar News
News February 14, 2026
భారీ జీతంతో దీన్దయాళ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

దీన్దయాళ్ పోర్ట్ అథారిటీ 9 పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మాస్టర్ ఆఫ్ ఫారిన్ గోయింగ్ షిప్ సర్టిఫికెట్ కలిగినవారు మార్చి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
నెలకు రూ.70,000-రూ. 2,00000 వరకు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.deendayalport.gov.in
News February 14, 2026
అనకాపల్లి జిల్లా ప్రజా ప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు

అనకాపల్లి జిల్లాకి చెందిన MP, MLA, ఎమ్మెల్సీలకు మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. పలువురు నాయకులు తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతులపై లోకేశ్ చర్చించారు. అనంతరం అందరూ కలిసి డిన్నర్ చేశారు. స్పీకర్ అయ్యన్న, హోంమంత్రి అనిత, MP CM.రమేశ్, MLAలు కొణతాల, బండారు, తదితరులు ఈ విందులో పాల్గొన్నారు.
News February 14, 2026
జగిత్యాల : ఈ అభ్యర్థులు ఓటు వేసుకోలేరా??

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. మెట్పల్లిలో నలుగురు, కోరుట్లలో ఇద్దరు మున్సిపల్ అభ్యర్థులు తమ ఓటు సైతం ఇతరులకు వేసినట్టున్నారు. కోరుట్ల పట్టణంలో 7వ వార్డు లోకిని రవి, 31వ వార్డు నన్నపనేని సేనాపతిరాజు, మెట్పల్లి పట్టణంలో 2వ వార్డు యామ గాయత్రి, 17వ వార్డు తోకల శ్రీరాములు, దుర్గం రాజశేఖర్, 18వ వార్డు లక్ష్మీ దుర్గం సున్నా ఓట్లు వచ్చాయి.


