News June 26, 2024
మహానందిలో చిరుత పాదముద్రలు గుర్తింపు

మహానంది పుణ్యక్షేత్రంలోని గోశాల వద్ద బుధవారం తెల్లవారుజామున చిరుత పులి సంచరించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. డీఆర్ఓ హైమావతి, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుత పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలను గుర్తించారు. మరోవైపు మహానంది గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆలయ సిబ్బంది సూచించారు.
Similar News
News February 28, 2026
ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని విస్తరించాలి: కలెక్టర్

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా సమర్థవంతంగా ప్రచారం చేయాలని కర్నూలు కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సమాచార శాఖ రూపొందించిన ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్ను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జిల్లాలో జీడీపీ, తలసరి ఆదాయం పెంచేందుకు శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, వ్యవసాయం, పశుసంవర్థకం, డ్రిప్ ఇరిగేషన్ రంగాల్లో రైతుల ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News February 27, 2026
358 మంది విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. మొత్తం 5,069 మంది విద్యార్థులకు గానూ 4,711 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.
News February 27, 2026
‘కర్నూలు జిల్లాలో పుష్కలంగా ఎరువుల నిల్వలు’

2025-26 రబీ సీజన్కు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లా అవసరాల కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


