News April 15, 2025
మహానందిలో మిస్టరీగానే వ్యక్తి మరణం

మహానంది సమీపంలోని అరటి తోటలో నిన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వివరాల కోసం రంగంలోకి దిగన ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా మృతదేహానికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మహానందిలోని ఈశ్వర్ నగర్ శివారులో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.
Similar News
News February 20, 2026
నంద్యాల: గుండెపోటుతో కోవా బన్ను వ్యాపారి మృతి

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 19, 2026
కర్నూలు జిల్లా ప్రజల పక్షాన అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే

దేశంలోని ఎక్కువగా వలసలు వెళ్లే రైతు కూలీలున్న ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాల్లో మరిన్ని KGBVలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పార్థసారథి కోరారు. వైసీపీ హయాంలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో 25 సీజనల్ హాస్టళ్లుంటే.. వాటిని కేవలం 6 నెలల్లోనే 78కి పెంచామని చెప్పారు. అందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్కు ధన్యవాదాలు తెలుపుతూ.. ఇవి సరిపోవని, ఇంకా కావాలని కోరారు.
News February 19, 2026
కర్నూలు: ప్రేమ విషయమై గొడవ.. బలవన్మరణం

ఆదోని అరుణ్ జ్యోతి నగర్ కాలనీకి చెందిన మహేశ్(20) <<19174453>>బలవన్మరణానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ‘మహేశ్ బేల్దారి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనై మేడపై ఇంట్లో ఉరేసుకొన్నాడు. ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు’ అని మూడో పట్టణ ఎస్ఐ రామస్వామి తెలిపారు.


