News September 23, 2024

మహానంది ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా శోభారాణి

image

మహానంది డిప్యూటీ కమిషనర్‌గా రాష్ట్ర దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న డీసీ.శోభారాణిని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహానంది ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి పల్నాడు జిల్లాలోని అమరేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా బదిలీ చేశారు.

Similar News

News September 22, 2024

కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసిన ఎంపీ శబరి

image

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌ను ఆదివారం నంద్యాల MP, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా.బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి శేషవస్త్రం, స్వామి, అమ్మవార్ల ఫొటో, అభిషేకం లడ్డూను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ దస్త్రాలు క్లియర్ చేసేందుకు సహకరించాలని కోరారు.

News September 22, 2024

టీడీపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం: మంత్రి ఫరూక్

image

నంద్యాల పట్టణంలోని 2వ వార్డులో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మైనారిటీ, న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసి అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

News September 22, 2024

కేసీ కెనాల్ అధికారులపై మంత్రి ఆగ్రహం

image

నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలోని కేసీ కెనాల్ లాకుల వద్ద జలవనరుల శాఖ అధికారులు ఆదివారం గుర్రపు డెక్క, వినాయక నిమజ్జనం వ్యర్థాలు తొలగించారు. మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్న నేపథ్యంలోనే పనులు చేసినట్లు సమాచారం. కేసీ కెనాల్‌పై వెళ్తున్న మంత్రి తన కారు ఆపి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఏమి చేశారని ప్రశ్నించారు.