News February 26, 2025
మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న MHBD అదనపు కలెక్టర్

మహబూబాబాద్ పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంస్థలో రాజయోగిని బ్రహ్మకుమారి సుజాత ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలను మహబూబాబాద్ జాయింట్ కలెక్టర్ విర బ్రహ్మచారి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా భక్తుల కొరకు శివలింగ క్షీరాభిషేకం, ఎల్ఈడీ శివలింగం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీ సోదర సోరీమణులు దేవి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
రామగుండం: ఖాళీ ప్లాట్ల ఓనర్లకు అదనపు కలెక్టర్ వార్నింగ్

రామగుండం మున్సిపల్ పరిధిలో ఖాళీ ప్లాట్లు పిచ్చిచెట్లతో పెరిగి, మురుగు నీరు నిలిచి దోమలు- పందుల పెరుగుదలకు కారణమవుతున్నాయని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. ఇలాంటి స్థలాలను గుర్తించి యాజమానులకు నోటీసులు జారీ చేస్తున్నామని, నోటీసు వచ్చిన వారం రోజుల్లో శుభ్రపరచని పక్షంలో మున్సిపాలిటీల చట్టం- 2019 ప్రకారం ఓనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: 56 మంది డిపాజిట్ గల్లంతు!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS మధ్యే పోరు నడిచింది. కాగా మొత్తం 58 మంది ఈ ఎన్నికలో పోటీ చేయగా నవీన్ యాదవ్, మాగంటి సునీత మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. ఇందులో నవీన్ యాదవ్ గెలుపొందగా సునీత రెండో స్థానంలో నిలిచారు. BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సహా 56 మంది డిపాజిట్ గల్లంతైంది. చిన్న పార్టీలు, స్వతంత్రుల్లో ఒక్కరికి కూడా 250 ఓట్లు దాటలేదు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: 56 మంది డిపాజిట్ గల్లంతు!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS మధ్యే పోరు నడిచింది. కాగా మొత్తం 58 మంది ఈ ఎన్నికలో పోటీ చేయగా నవీన్ యాదవ్, మాగంటి సునీత మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. ఇందులో నవీన్ యాదవ్ గెలుపొందగా సునీత రెండో స్థానంలో నిలిచారు. BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సహా 56 మంది డిపాజిట్ గల్లంతైంది. చిన్న పార్టీలు, స్వతంత్రుల్లో ఒక్కరికి కూడా 250 ఓట్లు దాటలేదు.


