News December 30, 2025
మహాశివరాత్రి భక్తుల కోసం ఐదు వైద్య బృందాలు : DM&HO రజిత …..

మహా శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ఐదు వైద్య బృందాలు ఏర్పాటు చేస్తామని DM&HO డా.రజిత తెలిపారు. 30 మంది డాక్టర్లు, 132 మంది పారామెడికల్ సిబ్బంది, 5 అంబులెన్సులను మూడు రోజుల పాటు రేయింబవళ్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రజలకు కనిపించే విధంగా క్యాంపులు ఏర్పాటు చేయాలని, అస్వస్థతకు గురయ్యే భక్తులకు క్షణాల్లో వైద్యం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు.
Similar News
News December 31, 2025
కృష్ణా: ముడా భూములకు రక్షణ ఏది.?

మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) పరిధిలో అక్రమ మట్టి తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతిని భరించలేక ఛైర్మన్ పదవికి మట్టా ప్రసాద్ రాజీనామా చేయగా, ప్రస్తుతం ఆ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించి ‘ముడా’ భూములను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
News December 31, 2025
పల్నాడు: కొమ్మాలపాటి పయనం ఎటు.?

పల్నాడు TDP అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్కు ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారని అనుకున్న తమ్ముళ్లకు పార్టీ అధిష్ఠానం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గతంలో పెదకూరపాడు టికెట్ ఆశించిన శ్రీధర్ను పక్కన పెట్టి అధిష్ఠానం భాష్యం ప్రవీణ్కు కట్టబెట్టగా.. శ్రీధర్కు అధ్యక్షుడి పదవి ఇచ్చారు. ప్రస్తుతం అది కూడా పోవడంతో శ్రీధర్ పయనం ఏంటనే చర్చ మొదలైంది.
News December 31, 2025
ఆదిలాబాద్: బాలుడి కిడ్నాప్

ADBలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కిడ్నాప్కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సునీల్ ప్రకారం.. NRML జిల్లాకు చెందిన మాణిక్ రావు కొడుకు ADBలోని శ్రీరాంరెడ్డిలో చదువుతున్నాడు. ఈనెల 20న గుర్తుతెలియని వ్యక్తి బాబాయ్నని చెప్పి తీసుకెళ్లి, MHలోని వదోలిలో వదిలిపెట్టాడు. పాఠశాల నుంచి వెళ్లే సమయంలో అవుట్పాస్ వివరాలు నమోదు చేయకపోవడంపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.


