News February 25, 2025

మహాశివరాత్రి.. మల్లన్న బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు: CP

image

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మహాశివరాత్రి, పెద్దపట్నం, సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న శివాలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 26న మహాశివరాత్రి పెద్దపట్నం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 25, 2025

జగిత్యాల: స్త్రీ నిధి రుణాలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి : డీఆర్‌డీవో

image

గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న స్త్రీ నిధి రుణాలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు సెర్ప్ సిబ్బంది కృషిచేయాలని డీఆర్‌డీవో రఘువరన్ పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెర్ప్ అధికారుల జిల్లాస్థాయి సమావేశం జరిగింది. స్త్రీ నిధి జోనల్ మేనేజర్ రవికుమార్ జిల్లాలోని రుణాల గురించి వివరించారు. డీపీఎం మాణిక్ రెడ్డి, భారతి ఉన్నారు.

News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News February 25, 2025

ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: ఈ నెల 27 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడంతో విద్యాసంస్థలు సిబ్బందికి సెలవు ఇవ్వడం లేదన్నారు. కొన్ని గంటలు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగులకు ఏడాదిలో అందించే సెలవులతో సంబంధం లేకుండా పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని బండి విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!