News February 27, 2025

మహాశివరాత్రి.. రామప్పలో నేటి కార్యక్రమాలు ఇవే

image

రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా రెండవ రోజు ఉదయం అభిషేకంతో ప్రారంభమై, వీరభద్ర పల్లెరము, భద్రకాళి పూజ, నిత్య పూజలు జరగనున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండాలలో నడుచుట కార్యక్రమాలతో రెండో రోజు కార్యక్రమాలు ముగియనున్నాయి. రెండవ రోజు భక్తుల సౌకర్యార్థము ఆర్టీసీ బస్సులను నడపనున్నారు.

Similar News

News February 27, 2025

జగిత్యాల: 12 pm వరకు పోలింగ్ శాతం నమోదు వివరాలు

image

జగిత్యాల జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీకి 39.12 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 20.10శాతం వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తంగా రెండు కలిపి 21 శాతం పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News February 27, 2025

MTM: సెయింట్ ఫ్రాన్సిస్‌లో ఓటు వేసిన కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మచిలీపట్నం సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కలెక్టర్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

News February 27, 2025

లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించిన WGL కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్లో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాల ఓటింగ్ విధానంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

error: Content is protected !!