News January 31, 2025
మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేయడం జరిగిందని వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10:20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5:45కు గోరఖ్పూర్లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News September 21, 2025
జీవీఎంసీలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రేపు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు ఈ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడును ఆ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.
News September 21, 2025
విశాఖ ఈ-గవర్నెన్స్ సదస్సుకు కేంద్ర సహాయ మంత్రి

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.05కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుండి నగరంలోని ప్రైవేట్ హోటల్కి చేరుకుని 3 నుంచి 4.30 వరకు 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు హాజరవుతారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఈ సదస్సుకి సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు.
News September 21, 2025
విశాఖలో రేపు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

ప్రతి సోమవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ను సెప్టెంబర్ 22న రద్దు చేశారు. విశాఖలో సెప్టెంబరు 22, 23వ తేదీలలో జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు నిర్వహించనున్నారని, ఈ సదస్సులో అధికారులు పాల్గొనవలసి ఉంటుందని కలెక్టర్ హరేంద్రప్రసాద్ తెలిపారు. దీంతో పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.