News April 17, 2025

మహా ముత్తారం అడవిలో పెద్దపులి సంచారం.. క్లారిటీ

image

మహా ముత్తారం మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అడవిలో పులి సంచరిస్తుందని ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ విషయమై అధికారులను Way2News వివరణ కోరగా.. గతంలో సంచరించిన పులి అడుగుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, మండలంలో పులి సంచారం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు.

Similar News

News April 19, 2025

ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.

News April 19, 2025

VKB: పనిచేయని నిఘా నేత్రాలు.. రెచ్చి పోతున్న దొంగలు

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో చిన్న చిన్న లోపాలతో సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. దీంతో దొంగలు రెచ్చిపోతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. వేల రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన పర్యవేక్షణ లోపంతో పనిచేయడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కెమెరాలకు మరమ్మతులు చేయించాలని, గ్రామాల్లో నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

News April 19, 2025

ఈ నెల 23న ‘పది’ ఫలితాలు?

image

AP: ఈ నెల 23న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ల వ్యాల్యుయేషన్ కూడా పూర్తయ్యింది. విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కు 6,19,275 మంది హాజరయ్యారు. వీరిలో 5,64,064 మంది ఇంగ్లిష్ మీడియం, 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు. Way2Newsలోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!