News April 7, 2025

మహా సూర్య వందనం ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

మహా సూర్య వందనం ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మహా సూర్య వందనం కార్యక్రమం ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. విద్యార్థులు వివిధ పాఠశాలల వసతి గృహాల నుంచి బస్సులలో వేదిక వద్దకు తరలించడం జరుగుతుందన్నారు. అలాగే తిరిగి వేదిక నుంచి వసతి గృహాలకు క్షేమంగా సురక్షితంగా తరలించడానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

Similar News

News November 12, 2025

సొంత గడ్డపై భారత్‌దే ఆధిపత్యం

image

టీమ్ఇండియాపై టెస్టుల్లో దక్షిణాఫ్రికాదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 44 టెస్టులు జరగగా సఫారీ టీమ్ 18, భారత్ 16 విజయాలు సాధించాయి. మరో 10 మ్యాచులు డ్రాగా ముగిశాయి. అయితే సొంత గడ్డపై 19 మ్యాచులు ఆడగా టీమ్ ఇండియా 11, దక్షిణాఫ్రికా ఐదింట్లో విజయం సాధించాయి. 3 టెస్టులు డ్రా అయ్యాయి. SA 2008లో చివరగా భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. ఈ నెల 14న ఇరు జట్ల మధ్య కోల్‌కతాలో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

News November 12, 2025

రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

image

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. అన్నమయ్యలోని దేవగుడి పల్లి నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా వీటిని ప్రారంభిస్తారు. పీఎం ఆవాస్ యోజన కింద 2,28,034 లక్షలు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292, PMAY జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

News November 12, 2025

నేడు 8,086 మందికి సామూహిక గృహప్రవేశాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 8,086 మంది లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశ మహోత్సవం నిర్వహించనున్నట్లు గృహ నిర్మాణశాఖ అధికారి వెంకటనారాయణ తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, పీఎంఏవై (యూ) 2.0 కింద మంజూరైన 2,357 ఇళ్లకు పత్రాలు అందిస్తామని ఆయన చెప్పారు.