News January 1, 2026
మహిళల సొమ్ము దారిమళ్లిస్తే జైలుకే: కలెక్టర్

పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్పై కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు. అవినీతిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు బుధవారం తెలిపారు. నిధులు దారిమళ్లించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, దుర్వినియోగమైన ప్రతి పైసా రికవరీ చేస్తామన్నారు. అక్రమాల వల్ల నష్టపోయిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున అండగా ఉండి, తిరిగి రుణాలు పొందేలా చర్యలు చేపడతామన్నారు.
Similar News
News January 1, 2026
చిత్తూరు కలెక్టర్కు శుభాకాంక్షల వెల్లువ

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ను పలువురు అధికారులు గురువారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బొకేలు, పండ్లు అందజేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో JC విద్యాధరి, డీఆర్వో మోహన్ కుమార్, మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎస్ఎస్పీఎ వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఐఅండ్ పీఆర్ అధికారి వేలాయుధం తదితరులు ఉన్నారు.
News January 1, 2026
NRPT: ’86 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు’

డిసెంబర్ 31న నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 86 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ గురువారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇవాళ ఉదయం 6 గంటల వరకు తనిఖీలు చేశారని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 1, 2026
FASTag: ఫిబ్రవరి 1 నుంచి KYV తొలగింపు

ఫాస్టాగ్ జారీలో జాప్యం లేకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. లైట్ వెయిట్ వెహికల్స్ అయిన కార్లు, జీపులు, వ్యాన్లకు నో యువర్ వెహికల్(KYV) ప్రాసెస్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి FEB 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. సరైన పత్రాలున్నప్పటికీ ఫాస్టాగ్ యాక్టివేషన్లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వాహనదారులకు దీని ద్వారా ఊరట లభించనుంది.


