News January 19, 2026
మహిళల స్వావలంబనకే ప్రభుత్వ ప్రాధాన్యం: అడ్లూరి

మహిళల ఆర్థిక స్వావలంబనకే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సంక్షేమానికి పథకాలు అమలు చేస్తూ కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Similar News
News April 14, 2026
స్టైలిష్ లుక్లో రామ్ చరణ్.. పిక్స్ వైరల్

హాంకాంగ్లోని విక్టోరియా హార్బర్లో జరిగిన ఫొటోషూట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్తో అదరగొట్టారు. ‘ఎస్క్వైర్ ఇండియా’ ఏప్రిల్ కవర్ పేజీ కోసం ఆయన వైట్ అండ్ వైట్ సూటులో క్లాసీగా మెరిశారు. ఓడపై దిగిన ఈ ఫొటోలతో పాటు, బ్రౌన్ కలర్ సూటులో ఉన్న మరిన్ని చిత్రాలను మ్యాగజైన్ తన X ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. చరణ్ గ్రేస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
News April 14, 2026
GNT: అమరావతి వరద నివారణ పనులకు టెండర్లు

రాజధాని అమరావతిలో వరద సమస్య పరిష్కారానికి ADCL చర్యలు వేగవంతం చేసింది. వరద నివారణ పనుల కోసం తాజాగా బిడ్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఉండవల్లి వద్ద భారీ సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్ను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతాన్ని తరచూ ముంచెత్తుతున్న వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.
News April 14, 2026
రేపే లాస్ట్ డేట్.. APPLY NOW

TG: రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలు, 93 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు నిర్వహించే ‘TGRJC CET’కు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. MPC, BiPC, MEC, CECలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే 60వేల మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తుకు అర్హులే. ఈ ప్రవేశ పరీక్ష మే 3న జరుగుతుంది. ఇక్కడ <


