News July 5, 2024

మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉంది: నారా లోకేశ్

image

ఏపీకి చెందిన మహిళా అథ్లెట్లు 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికవడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కొన్నేళ్లుగా దండి జ్యోతికశ్రీ, యర్రాజి జ్యోతి పడిన కష్టానికి మంచి అవకాశం లభించిందన్నారు. కృషి, పట్టుదలతో వారు కచ్చితంగా ఒలింపిక్ మెడల్ అందుకోవాలనే కలను నెరవేర్చుకుంటారన్నారు. ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచి ఏపీ ప్రజలు గర్వపడేలా చేయాలని లోకేశ్ ఆకాంక్షించారు.

Similar News

News September 17, 2025

GNT: CM ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్

image

DSC నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం సమీక్షించారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర సచివాలయం దగ్గర DSCలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రాంగణంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో SP వకుల్ జిందాల్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, గుంటూరు RDO శ్రీనివాస రావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.

News September 17, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. మట్టి నమూనాల సేకరణ

image

హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించతలపెట్టిన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా, గుంటూరు జిల్లాలో ఫైనల్ లొకేషన్ సర్వే బుధవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. DPR రూపొందించడం, ఫైనల్ ఎలైన్‌మెంట్ డిజైన్ కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా, 20 మీటర్ల లోతులో ప్రతి 5 మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు.

News September 17, 2025

శాసన సభ స్పీకర్‌ను కలిసిన గుంటూరు ఎస్పీ

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంతోపాటు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకొని ప్రజా భద్రతను కాపాడాలని స్పష్టం చేశారు.