News February 25, 2025
మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో భద్రాద్రి జిల్లాకు 4వ స్థానం

గాంధీభవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన జరిగిన నారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొన్నారు. తెలంగాణలో లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ హాజరయ్యారన్నారు. మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో జిల్లాకు 4వ స్థానం దక్కిందన్నారు.
Similar News
News February 25, 2025
జనసంద్రంగా శ్రీశైలం

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మల్లన్నను దర్శించుకుని సాయంత్రం జరిగే ఉత్సవాలను తిలకించి భక్తులు తరిస్తున్నారు.
News February 25, 2025
MLC ఎన్నికల్లో CBN, లోకేశ్కు ఓటు హక్కు.. పవన్ దూరం

AP: CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలో గ్రాడ్యుయేట్ MLC ఓటు హక్కు పొందారు. ఈ నెల 27న తాడేపల్లి (M) గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్ స్కూల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదే నియోజకవర్గంలోనే ఉంటున్న Dy.CM పవన్ పట్టభద్రుడు కాకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరోవైపు, మాజీ CM జగన్ తాడేపల్లిలోనే ఉంటున్నా ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది.
News February 25, 2025
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్: ఇలా త్రిపాఠి

ఈనెల 27న జరగనున్న వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. సైలెన్స్ పీరియడ్లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 27సాయంత్రం 4 గంటల వరకు సభలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధమని చెప్పారు.