News March 5, 2025

మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి: జిల్లా కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ కోసం ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 8న నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 6, 2025

జిల్లాని ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్ డా.వినోద్ కుమార్

image

పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారీగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ పథకం అమలులో జిల్లాని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

News March 5, 2025

ఈ నెల చివరి వరకు రైళ్లు తిరగవు..!

image

గుంతకల్లు మీదుగా ప్రయాణం సాగించే పలు ప్యాసింజర్ రైళ్లు కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తిరిగి ఆ రైళ్లు గుంతకల్లుకు చేరుకునేందుకు ఈ నెల చివరి వరకూ పడుతుందని అధికారులు పేర్కొన్నారు. తిరుపతి-కదిరిదేవరపల్లి (57405) ప్యాసింజర్ రద్దును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించామన్నారు. కదిరిదేవరపల్లి-తిరుపతి(57406) ఈనెల 31, గుంతకల్లు-తిరుపతి(57404) 30, తిరుపతి-గుంతకల్లు(57403) 31వ తేదీ వరకు తిరగవన్నారు.

News March 5, 2025

అంగన్వాడీ కేంద్రాలకు నిధుల మంజూరు

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ.3.08 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అంగన్వాడీలలో సీమంతం, అన్నప్రాశన, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. అనంత జిల్లాలో 2,303 కేంద్రాలకు రూ.1.38 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,824 కేంద్రాలకు 1.70 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!