News March 7, 2025

మహిళా సదస్సు ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

image

ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వసతులు తదితర అంశాలను చర్చించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్‌పోల్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, మహిళలకు మజ్జిగప్యాకెట్లు అందించాలన్నారు.

Similar News

News March 7, 2025

రేవంత్‌ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్‌ భస్మమే: KTR

image

కరీంనగర్‌ – నిజామాబాద్‌ – మెదక్‌ – ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. సీఎం ఎక్కడ బాధ్యత తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తుందని అన్నారు. రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్‌ భస్మమే అని ఆరోపించారు.

News March 6, 2025

ఇఫ్లూ వీసీగా ప్రొఫెసర్ నాగరాజు

image

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొ.నాగలపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని గంగాధర్ మెహర్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అధ్యాపకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.

News March 6, 2025

HYD: ORRపై యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

image

రావిర్యాల ORR ఎగ్జిట్ 13 వద్ద యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల సమాచారం.. ORRపై చెట్లకు నీళ్లు పడుతున్న సిబ్బందిని కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కార్ డ్రైవర్, కోప్యాసింజర్, ఫ్లాగ్ మ్యాన్ మృతిచెందారు. ఘట్కేసర్ వద్ద 3:15కు కార్ ఎంట్రీ అవ్వగా.. 3:30కి యాక్సిడెంట్ జరిగిందని, 15 MINలో దాదాపు 37 కి.మీ చేరుకునేంత ఓవర్ స్పీడ్‌లో వచ్చాడని అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!