News August 11, 2025
మహిళ ఫ్రీ బస్.. విజయనగరం జిల్లాలో ఎన్ని బస్సులంటే

“శ్రీ శక్తి పధకం” ద్వారా ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్ సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి. వరలక్ష్మి అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 160 బస్సులు నడుస్తున్నాయన్నారు. అందులో పల్లెవెలుగు-108, అల్ట్రా పల్లె వెలుగు-7, మెట్రో ఎక్స్ ప్రెస్-14, ఎక్స్ ప్రెస్-8 బస్సుల్లో(మొత్తం 137) మహిళలు ఉచితంగా ప్రయాణించ వచ్చన్నారు. గుర్తింపు కార్డు చూపించాల్సి ఉందని వెల్లడించారు.
Similar News
News September 26, 2025
VZM: ‘GST తగ్గుదలపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

ప్రభుత్వం తగ్గించిన GSTపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వలన జరిగే ఆదా గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు.
News September 26, 2025
పైడితల్లమ్మ పండగ సందర్భంగా ప్రత్యేక వైద్య శిబిరాలు

పైడితల్లమ్మ పండగ సందర్భంగా 6 ప్రాంతాల్లో, విజయనగరం ఉత్సవాల సందర్భంగా 15 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జీవనరాణి శుక్రవారం తెలిపారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందితో 3 షిప్టుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రథమ చికిత్స వైద్య శిబిరాల సేవలను ప్రజలు, భక్తులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
News September 26, 2025
VZM: ‘పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలి’

పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలని, తల్లీదండ్రులే సంస్కారాన్ని నేర్పించి బయటకు పంపిస్తే చెడు పనులు చేయరని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో 8వ రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆడవారికి ఆపదలు పక్కనే పొంచి ఉంటాయని, తెలిసిన వారి నుంచే ఎక్కువ ముప్పు కలుగుతుందని అన్నారు. ఆడవారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.