News March 22, 2025

‘మాంసం, కూరగాయల క్లస్టర్‌గా అనకాపల్లి జిల్లా’

image

అనకాపల్లి జిల్లాలో మాంసం, కూరగాయల క్లస్టర్‌గా ప్రభుత్వం ప్రకటించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో డీడీసీ, డీఎల్ఆర్సీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ తదితర ఉపాధి రంగాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ రంగాల్లో వచ్చే ఏడాదికి 17% వృద్ధి సాధించే విధంగా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News November 8, 2025

ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ పెడుతున్నారా?

image

ప్లాస్టిక్ డ‌బ్బాల్లో ఆహారాన్ని నిల్వ చేయడం సర్వసాధారణం. కానీ వీటిలో వేడి పదార్థాలు, నూనెలు, ఆమ్ల స్వభావం గ‌ల ఆహారాలను పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు నిపుణులు. ఆహారాన్ని నిల్వ చేయడానికి.. గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్, సిలికాన్, బీస్‌వాక్స్, వెదురుతో చేసినవి వాడొచ్చు. అవ‌న్నీ విష‌ర‌హిత ప‌దార్థాల‌తో త‌యారు చేయ‌డం వ‌ల్ల.. ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయంగా వాటిని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 8, 2025

కృష్ణా: LLB & BA.LLB కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB & BA.LLB కోర్సులకు 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రతీ సెమిస్టర్‌లో 90- 92 పని దినాలు, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్‌ను రూపొందించామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.

News November 8, 2025

నెల్లూరు: అధికారులకు షోకాజ్ నోటీసుల జారీ

image

నెల్లూరు జిల్లాలో విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు పంచాయతీ కార్యదర్శులు, నిధులు దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు DPO శ్రీధర్ తెలిపారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో హౌస్ టాక్స్ మెటీరియల్ గురించి తప్పుగా నమోదు చేసిన ఉదయగిరి, పెద్దపవని, ఏఎస్ పేట, తాటిపర్తి PSలకు నోటీసులు అందజేశారు. ఎనమాదాల సర్పంచ్ సుందరయ్య ఆరో ప్లాంట్ నిధులు దుర్వినియోగంపై నోటీసులు అందజేశారు.