News April 2, 2025
మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదం.. వార్డు సభ్యుడు మృతి

మాకవరపాలెం మండలంలో అవంతి కళాశాల ఎదురుగా బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమ బోయినపాలెంకి చెందిన వార్డు సభ్యుడు లాలం మణిబాబు మృతి చెందాడు. మాకవరపాలెం నుంచి బైక్పై స్వగ్రామం వెళుతుండగా అవంతి కళాశాల వద్దకు వచ్చేసరికి కళాశాల లోపల నుంచి వస్తున్న బైక్ ఢీ కొట్టింది. దీంతో మణిబాబును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 21, 2026
బుట్టాయిగూడెంలో కారు ఢీకొని వృద్ధుడు మృతి

బుట్టాయిగూడెం మండలం నందాపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి దాటుతున్న పాయల సుబ్బారావు (60) అనే వ్యక్తిని వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ సుమారు 100 కి.మీ. వేగంతో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సుబ్బారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 21, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* మచిలీపట్నంలో ట్యూబ్ లైట్తో ఫ్రెండ్ని పొడిచిన యువకుడు
* గన్నవరంలో ఫ్లైట్ నిలిపివేత.. ప్రయాణికుల ఆందోళన
* కురుమద్దాలి వద్ద ప్రమాదం.. ఒకరి మృతి
* విజయవాడలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
* 22న గన్నవరంలో టెన్నిస్ బాల్ క్రికెట్ జట్లు ఎంపిక
* కృష్ణాజిల్లా పోలీసులకు మంత్రి లోకేశ్ ప్రశంసలు
* నందిగామలో పెళ్లి బస్సు డ్రైవర్ గుండుపోటుతో మృతి
* విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం
News February 21, 2026
నంద్యాల: బీటెక్ విద్యార్థి మృతి

నంద్యాల సమీపంలోని పొన్నాపురం వద్ద రైలు పట్టాలపై బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు శనివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు బేతంచెర్లకు చెందిన విజయ్ కుమార్(27)గా గుర్తించారు. కర్నూలులోని KV సుబ్బారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


