News December 16, 2024
మాకవరపాలెం: ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

మాకవరపాలెం(M) జంగాలపల్లిలో కోళ్లఫారంలో పనిచేస్తున్న గిరిజన యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పాడేరు మండలం బడిమెలకు చెందిన గోల్లూరి సంతి(19) భర్త కొర్రా చరణ్తో కలసి జంగాలపల్లిలో కోళ్లఫారంలో పనిచేసేందుకు చేరారు. సోమవారం కోళ్లకు మేత వేసే విషయంలో ఇద్దరికీ వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురై ఆమె ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ దామోదర్ తెలిపారు.
Similar News
News September 20, 2025
విశాఖ: కరెంట్ షాక్తో వ్యక్తి మృతి

విశాఖలో ఓ వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందాడు. పెందుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. చెంగల్రావుపేటకు చెందిన బెహరా అబ్బాయి (65) ఇంట్లో క్లీనింగ్ చేస్తుండగా, ఇనుప రాడ్ ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలింది. ఈ ఘటనలో ఆయన చేతులు, శరీరంపై పలుచోట్ల కాలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 20, 2025
25న ఎంవీపీ కాలనీలో తపాలా డాక్ అదాలత్

తపాలా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 25న ఎంవీపీ కాలనీ రీజనల్ కార్యాలయంలో 119వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈ నెల 22వ తేదీ లోపు రీజనల్ కార్యాలయం చిరునామాకు సమర్పించాలని అధికారులు తెలిపారు.
News September 20, 2025
కౌన్సిల్ తీర్మానం మేరకే ఆక్రమణలు తొలగింపు: జీవీఎంసీ కమిషనర్

జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా ఫుడ్ కోర్ట్ తొలగించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం తెలిపారు. ఫుడ్ కోర్ట్లో 160 దుకాణాలు అనధికారకంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నారు. 2023లోని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఫుడ్ కోర్ట్ తొలగింపునకు కౌన్సిల్ తీర్మానించదన్నారు. మరళ 2025 ఆగస్టు 22న జీవీఎంసీ కౌన్సిల్లో సభ్యుల అంగీకారంతో తీర్మానం జరిగిందన్నారు.