News October 8, 2025

మాకవరపాలెం: జగన్ పర్యటన.. భద్రతపై ఎస్పీ సమీక్ష

image

మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంతాన్ని ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు. రేపు జరగనున్న మాజీ సీఎం జగన్ పర్యటనకు సంభందించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడే ప్రదేశంతో పాటు కళశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 8, 2025

KMR: జిల్లాలో భారీ వర్ష నష్టంపై కేంద్ర బృందం రివ్యూ

image

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం పీకే రాయ్ (జాయింట్ సెక్రెటరీ, హోమ్ అఫైర్స్) నేతృత్వంలో బుధవారం జిల్లాలో పర్యటించింది. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో మీట్ అయ్యారు. 3 రోజుల్లోనే జిల్లాలో సగటు వర్షపాతం 40 శాతం కురిసిందని, దీనివల్ల రహదారులు, వంతెనలు, పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

News October 8, 2025

జగన్ పర్యటనలో మార్పులు: గుడివాడ అమర్నాథ్

image

మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనలో మార్పులు జరిగాయని, ఆయన కేజీహెచ్‌లో కురుపాం విద్యార్థులను పరామర్శిస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు అనుమతులపై డ్రామా సృష్టిస్తూన్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి ఫ్లెక్సీలు తొలగిస్తూ, ఆంక్షలతో పర్యటనను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

News October 8, 2025

SBI డౌన్.. UPI సేవలకు అంతరాయం

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) UPI సేవల్లో అంతరాయం ఏర్పడింది. ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామంటూ కస్టమర్లు SMలో రిపోర్ట్ చేస్తున్నారు. దీనిపై SBI స్పందించింది. టెక్నికల్ సమస్య వల్ల UPI సేవలు డిక్లైన్ అవుతున్నాయంది. అంతరాయానికి చింతిస్తున్నామని, 8PM లోగా సరిచేస్తామని స్టేట్‌మెంట్ విడుదల చేసింది. అయితే ఆ సమయం దాటినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదని కస్టమర్లు వాపోతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురైందా?