News September 20, 2025

మాచర్లకు చేరుకున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు మాచర్లకు చేరుకున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన యాదవ బజార్‌లో ఉన్న చెరువు వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Similar News

News September 20, 2025

NLG: దరఖాస్తుల ఆహ్వానం.. ఈనెల 30 లాస్ట్

image

2025-26 ఆర్ధిక సంవత్సరమునకు గాను స్వచ్చంద సంస్థలు/ ప్రభుత్వేతర సంస్థలు.. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు, మానసిక వికలాంగుల ఆశ్రమాలు మొదలగు సంస్థలలకు ఆర్థిక సహాయం అందించుటకు గాను అర్హత గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా పరిధిలోని, రిజిస్టర్డ్ స్వచ్చంద సంస్థలు/ప్రభుత్వేతర సంస్థలు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 20, 2025

GST ఎఫెక్ట్.. సిలిండర్ ధర తగ్గుతుందా?

image

ఈనెల 22 నుంచి GST కొత్త శ్లాబులు అమల్లోకి రానుండటంతో నిత్యావసరాలతో పాటు చాలా వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. అయితే నిత్యం వాడే వంటగ్యాస్ సిలిండర్ రేటు కూడా తగ్గుతుందా అనే సందేహం సామాన్యుల్లో నెలకొంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్‌పై 5%, కమర్షియల్ సిలిండర్‌పై 18% GST అమల్లో ఉంది. ఇకపైనా ఇదే కొనసాగనుంది. దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.905 ఉంది.

News September 20, 2025

సిరిసిల్ల కలెక్టర్ బదిలీకి రంగం సిద్ధం?

image

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణలో ప్రొటోకాల్ విస్మరించడం పట్ల చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న విప్ ఆది శ్రీనివాస్ ప్రొటోకాల్‌తో పాటు కలెక్టర్ తరచూ వివాదాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై రేవంత్ సీరియస్‌గా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.