News March 26, 2024
మాచవరం పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి

విజయవాడ గుణదల విజయనగర్ కాలనీలో మంగళవారం ఉదయం ఓ అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకుపోయేందుకు వచ్చానంటూ హల్ చల్ చేశాడు. స్పందించిన స్థానిక ప్రజలు అతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మాచవరం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 17, 2025
కృష్ణా: నేడు ‘మీకోసం’ కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.
News March 17, 2025
కృష్ణా: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల చుట్టు పక్కల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నెట్, జిరాక్స్ సెంటర్లు, ఇతర ఏ విధమైన షాపులు తెరవడానికి వీలు లేదన్నారు.
News March 17, 2025
కృష్ణా జిల్లాలో పది పరీక్షలకు సర్వం సిద్ధం

నేటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 145 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 22,341 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పరీక్షా కేంద్రాల్లో చేపట్టారు. మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా 52 సిట్టింగ్, 05 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశారు.