News April 7, 2024

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మామ మృతి

image

చిలకలూరిపేట మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మామ బొగ్గల వరపు వీరయ్య ఆదివారం కన్ను మూశారు. ఇటీవల హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వీరయ్య గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. శస్త్ర నంతరం ఆరోగ్యం మెరుగుపడినా శనివారం సాయంత్రం మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు.

Similar News

News April 2, 2025

GNT: కారు ప్రమాద ఘటనపై పెమ్మసాని స్పందన

image

తెనాలికి చెందిన గిడుగు రవీంద్ర మోహన్ బాబు కుటుంబానికి జరిగిన కారు ప్రమాద ఘటనపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. మృతుల బంధువులను, ఆసుపత్రి వర్గాలను డిల్లీ నుంచి ఫోన్ ద్వారా సంప్రదించారు. గుండె నిబ్బరం చేసుకుని సందీప్ దంపతులకు అందంగా అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూసే ప్రయత్నం చేస్తానని, ఈ సందర్భంగా సందీప్ బంధువులకు పెమ్మసాని వివరించారు.

News April 1, 2025

GNT: హైకోర్టుకు మాజీమంత్రి విడదల రజిని

image

ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని ఆశ్రయించారు. ఏసీబీ కేసు నుంచి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. వివరాలు సమర్పించాలని హైకోర్టు ఏసీబీకి ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

News April 1, 2025

పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: DEO

image

ఒంటిపూట బడులకు భిన్నంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి C.V రేణుక ఒక ప్రకటనలో హెచ్చరించారు. మార్చి 15 నుండి ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించినా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని పాటించడం లేదని డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 ని.ల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

error: Content is protected !!