News April 13, 2025

మాజీ మంత్రి రోజాకు కీలక బాధ్యతలు

image

వైసీపీ రాజకీయ సలహా మండలి (PAC)ని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా ఆ పార్టీలోని 30 మంది సీనియర్లకు చోటు కల్పించారు. చిత్తూరు జిల్లా నుంచి మాజీ మంత్రులు ఆర్కే రోజా, నారాయణస్వామికి అవకాశం దక్కింది. తమకు అవకాశం కల్పించిన జగన్‌కు ఇద్దరు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామన్నారు.

Similar News

News November 10, 2025

AP లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్‌గా శాంతిపురం వాసి

image

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్‌గా శాంతిపురం టీడీపీ నేత విశ్వనాథ నాయుడు నియమితులయ్యారు. రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు ప్రభుత్వం నూతన కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా విశ్వనాథ్‌కు అవకాశం కల్పించారు. ఆయన నియామకం పట్ల టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

News November 10, 2025

అవినీతికి పాల్పడితే చర్యలు: కలెక్టర్

image

వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ జేడీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, అర్హులకు వాటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎవరన్నా అవినీతికి పాల్పడితే చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

News November 10, 2025

చిత్తూరు పోలీసులకు 43 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ తుషార్ డూడీ వినతులు స్వీకరించారు. 43 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వాటిని విచారించి బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.