News October 27, 2025

మాజీ మేయర్ హత్య కేసు తీర్పు 30కి వాయిదా

image

మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News October 27, 2025

యాదాద్రి: ప్రభుత్వ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన

image

మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మించనున్న నూతన MRO, MPP కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం మెరుగైన వసతులతో కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News October 27, 2025

BWF-2025 తదుపరి టోర్నీలకు పీవీ సింధు దూరం

image

ఒలింపిక్ బ్యాడ్మింటన్ పతక విజేత PV సింధు ‘BWF TOUR-2025’ తదుపరి ఈవెంట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ లీగ్‌కు ముందు పాదానికి తగిలిన గాయం పూర్తిగా మానకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గాయం కొంత తగ్గినప్పటికీ దీర్ఘకాలిక ఫిట్‌నెస్, ఆట మెరుగుపడటానికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. 2026 JANలో బ్యాడ్మింటన్ కోర్టులో దిగేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

News October 27, 2025

నిర్మల్: ‘ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తాం’

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్న ఫిర్యాదులను ఫునఃపరిశీలించి తగిన విధంగా పరిష్కార మార్గాలు చూపుతామని అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. గ్రామీణ, పట్టణ స్థాయి, వ్యవసాయ భూముల సంబంధిత దరఖాస్తులు అధికంగా వస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల సిబ్బంది పనితనం మెరుగుపరచుకోవాలన్నారు.