News July 3, 2024
మాజీ సీఎంను కలిసిన నిర్మల్ నేతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719937671287-normal-WIFI.webp)
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మంగళవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.
Similar News
News July 5, 2024
జైపూర్: వన మహోత్సవంలో MP, MLA, IAS
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720166243162-normal-WIFI.webp)
జైపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కను నాటి ప్రకృతికి అండగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News July 5, 2024
ఆదిలాబాద్: వారికి రేషన్ బియ్యం రాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720148421830-normal-WIFI.webp)
బోగస్ ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం ఏరివేస్తోంది. రేషన్ డీలర్లకు లబ్ధిదారుల జాబితా పంపించి పరిశీలన ప్రక్రియ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులతో విచారణ చేయించి బోగస్ కార్డులు రద్దు, అనర్హుల పేర్లు తొలగింపునకు చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దు చేయగా, 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు.
News July 5, 2024
రాష్ట్ర గవర్నర్ OSDగా మంచిర్యాల జిల్లా వాసి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720153274133-normal-WIFI.webp)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ OSDగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సిరిశెట్టి సంకీర్తన్ నియామకం అయ్యారు. ఆయన 2020లో IPS శిక్షణ పూర్తి చేసుకుని ములుగు, మధిర జిల్లాలకు ప్రొబెషనరీ IPSగా పని చేశారు. అనంతరం ఏటూరునాగారం ASPగా పనిచేసిన సంకీర్తన్ ఇటీవల గవర్నర్ OSDగా నియమితులయ్యారు. గవర్నర్ OSDగా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయన తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.